హైదరాబాద్, ఆగస్టు 9: ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్కైండ్..ప్రముఖ హీరో మహేష్ బాబును ప్రచారకర్తగా నియమించుకున్నది. కంపెనీకి చెందిన మల్టీవిటమిన్, మినరల్స్ ట్యాబ్లెట్ ‘హెల్త్ ఓకే’కు ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. మహేష్ బాబుతోపాటు సుదీప్ సంజీవ్ను కూడా ప్రచారకర్తగా నియమించుకున్నది సంస్థ. దక్షిణాది మార్కెట్లో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో వీరిద్దరిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు ప్రకటించింది.