Reliance M-Cap | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్లో టాప్-10 కంపెనీల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,29,047.61 కోట్లు పెరిగింది. వీటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 583.91 పాయింట్లు (1.03 శాతం) లబ్ధి పొందింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీఐ) లబ్ధి పొందాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ నష్టపోయాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.71,761.59 కోట్లు పెరిగి రూ.13,46,325.23 కోట్లకు చేరుకున్నది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.18,693.62 కోట్ల మేరకు పెరిగి దాని విలువ రూ.7,29,618.96 కోట్లకు పెరిగింది.
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,082.77 కోట్లు పెరిగి రూ.4,26,753.27 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.12,744.21 కోట్లు పెరిగి రూ.8,38,402.80 కోట్ల వద్ద స్థిరపడింది. హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.5,393.86 కోట్లు ఎక్కువై రూ.5,01,562.84 కోట్ల వద్ద ముగిసింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.2,409.65 కోట్లు పెరిగి రూ.4,22,312.62 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.1,961.91 కోట్లు పెరిగి, రూ.5,50,532.73 కోట్లకు చేరుకున్నది.
దీనికి భిన్నంగా భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,489.77 కోట్లు పతనమై రూ.3,94,519.78 కోట్ల వద్ద నిలిచింది. ప్రైవేట్ బ్యాంకర్ ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.3,686.55 కోట్లు తగ్గి రూ.4,97,353.36 కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2,537.34 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. ప్రస్తుతం రిలయన్స్ ఎం-క్యాప్ రూ.15,27,572.17 కోట్లుగా ఉంది.
శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.