CNG Bike | వాహనదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీఎన్జీ బైకులు రాబోతున్నాయి. దేశంలోనే తొలిసారిగా తాము రూపొందించిన సీఎన్జీ ద్విచక్ర వాహనాలను ఈ ఏడాది జూన్లో ఆవిషరించనున్నట్లు బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ వెల్లడించారు. శుక్రవారం పుణె పింప్రీ చించోడ్లోని సిల్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించిన బజాజ్ బియాండ్ కార్యక్రమాన్ని బజాజ్ ఎలక్ట్రికల్స్ సంస్థ సీఎండీ శేఖర్ బజాజ్, బజాజ్ ఆటో సీఎండీ నీరజ్ బజాజ్లతో కలిసి రాజీవ్ బజాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజీవ్ బజాజ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ బైక్ టెస్టింగ్ దశలో ఉన్నదని, వచ్చే మూడు నెలల్లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి చర్యలను వేగవంతం చేసినట్లు చెప్పారు. సీఎన్జీ వాహనాలను వినియోగించడంతో పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతున్నదన్నారు. ప్రస్తుతం దేశంలో 60 శాతం ఆటోలు సీఎన్జీతోనే నడుస్తున్నాయని, తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుండటం ఇది మంచి పరిణామమన్నారు.
ఇదే కోవలో తాము ద్విచక్ర వాహనాన్ని రూపొందించేందుకు ప్రయత్నించామని, కార్లు, ఆటోల్లో సీఎన్జీ సిలిండర్ పెట్టేందుకు చోటు ఉంటుందని, కానీ బైకుకు సిలిండర్ ఏ చోట పెడితే బాగుంటుందన్న అంశంపై అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. ఈ బైకు ధర రూ.70 వేల నుంచి 80 వేల స్థాయిలో ఉంటుందని ఆయన సూచనప్రాయంగా చెప్పారు.
రాబోయే ఐదేండ్లలో సిల్ డెవలప్మెంట్ కోసం రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు బజాజ్ సంస్థ ప్రకటించింది. బజాజ్ బియాండ్ పేరుతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఆయా మొత్తాన్ని నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సంస్థ వర్గాలు ప్రకటించాయి. ఈ ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణను ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.
జాతీయంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు సీఐఐ… రాహుల్ బజాజ్ సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ ఇన్ సిల్స్ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బజాజ్ సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందినవారు బజాజ్తోపాటు ఏ కంపెనీలోనైనా ఉద్యోగాలు పొందవచ్చు అన్నారు. అనంతరం పుణెలోని సింబాయాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన బజాజ్ ఇంజనీరింగ్ సిల్స్ ట్రైనింగ్ (బెస్ట్) సెంటర్ను రాజీవ్ బజాజ్ ప్రారంభించారు.
-పుణె నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి