ముంబై, సెప్టెంబర్ 7: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో భారీ ఆర్డరు సంపాదించింది. చమురు ఉత్పత్తి దిగ్గజం సౌదీ ఆరామ్కో నుంచి 2.9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.24,000 కోట్లు) కాంట్రాక్టు పొందినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తల్ని ఎల్ అండ్ టీ ధృవీకరించాల్సి ఉంది. కాంట్రాక్టులో భాగంగా ఆరామ్కోకు చెందిన గ్యాస్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ను, ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్లను ఎల్ అండ్ టీ నిర్మిస్తుంది. అలాగే సౌదీలోని సఫానియా గ్యాస్ ఫీల్డ్లో మరో 10 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి కూడా ఎల్ అండ్ ఇటీవల బిడ్ చేసింది. ఈ ఏడాది మే నెలలో సైతం భారత్లోనూ, సౌదీఅరేబియాలోనూ భారీ పవర్ ట్రాన్స్మిషన్ ఈపీసీ కాంట్రాక్టుల్ని సంపాదించింది. జూన్లో ముంబై-అహ్మదాబాద్ హౌ స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఒక భారీ ఆర్డరు చేజిక్కించుకుంది.
సౌదీ ఆరామ్కో ఆర్డరు లభించిందన్న వార్తలతో గురువారం ఎల్ అండ్ టీ షేరు భారీగా పెరిగి ఆల్టైమ్ రికార్డుస్థాయి రూ.2,846 వద్ద ముగిసింది. ఈ ర్యాలీ ఫలితంగా ఎల్ అండ్ టీ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.4 లక్షల కోట్ల మార్క్ను దాటింది. షేరుకు రూ.3,000 చొప్పున 3.33 కోట్ల షేర్లను రూ. 10,000 కోట్లతో బైబ్యాక్ చేసేందుకు ఎల్ అండ్ టీ ప్రకటించిన రికార్డు తేదీ సెప్టెంబర్ 12.