ముంబై, అక్టోబర్ 1: ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా వడ్డీరేట్లను క్రమంగా తగ్గిస్తున్నాయి. తాజాగా విదేశీ సంస్థయైన హెచ్ఎస్బీసీ..గృహ రుణాల బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్పై వడ్డీరేటును పది బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణ రేటు 6.45 శాతానికి దిగింది. బ్యాంకింగ్ రంగంలో అతి తక్కువ వడ్డీరేట్లలో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. అలాగే కొత్తగా రుణాలు తీసుకునేవారికి 6.70 శాతం వడ్డీకే ఇస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, యెస్ బ్యాంక్ కూడా వడ్డీరేట్లలో కోత విధించింది. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేసింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనున్నది.