న్యూఢిల్లీ, మార్చి 8: సెక్యూరిటీల మార్కెట్లో లావాదేవీలను సజావుగా కొనసాగించేందుకు ఈ నెల 31కల్లా ఆధార్ నంబర్తో పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)ను లింక్ చేయాలంటూ ఇన్వెస్టర్లకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సూచించింది.
ఈ రెండింటినీ లింక్ చేయకపోతే కేవైసీ నిబంధనల్ని పాటించనట్టుగా పరిగణిస్తామని, వీటిని అనుసంధానించేంతవరకూ సెక్యూరిటీల (షేర్లు, బాండ్లు తదితరాలు) లావాదేవీలపై నియంత్రణలు ఉంటాయని సెబీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023 మార్చి 31కల్లా ఆధార్తో లింక్ చేయని పాన్ చెల్లదని 2022 మార్చిలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఒక సర్క్యులర్ జారీచేసింది.