హైదరాబాద్, జనవరి 19: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) సరికొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. జీవన్ ఆజాద్ పేరుతో విడుదల చేసిన ఈ ప్లాన్ వ్యక్తిగతంగాను సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్తోపాటు తీసుకోవచ్చును. లిమిటెడ్ ప్రీమియం చెల్లింపులు జరిపే ఈ ఎండోమెంట్ ప్లాన్తో అకస్మాత్తుగా పాలసీ తీసుకున్నవారు మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక బరోసానివ్వనున్నది. అలాగే పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత గ్యారెంటీ లంప్సమ్ కింద నగదు చెల్లించనున్నది. పాలసీదారుడు మరణించిన తర్వాత తాను చెల్లించిన ప్రీమియం మొత్తం కంటే 105 శాతం అధికంగా ప్రయోజనం కలుగనున్నది.