హైదరాబాద్, జనవరి 23: ఎల్ఐసీకి చెందిన ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ సంస్థ హైదరాబాద్లో ఆధునీకరించిన నూతన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించబోతున్నది. ఈ సందర్భంగా ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్కే ఝా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఫండ్లలో పెట్టుబడిపెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరిగారని, ఒక హైదరాబాద్లోనే లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారని చెప్పారు. గతేడాది చివరినాటికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ రూ.50.77 లక్షల కోట్లకు చేరుకోగా..దీంట్లో తెలంగాణ-ఏపీ వాటా రూ.1.43 లక్షల కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం రూ.27 వేల కోట్లుగా ఉన్న కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్(ఏయూఎం) విలువ వచ్చే రెండేండ్లలో లక్ష కోట్లకు చేరుకుంటుందన్నారు.