LIC IPO | ఆదివారం స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీఐ) శాఖలన్నీ తెరిచి ఉంటాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రస్తుతం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీవో సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఐపీవో కోసం ఇన్వెస్టర్లు బిడ్లు దాఖలు చేయొచ్చు. ఈ నెల 8న ఆదివారం ఎల్ఐసీ ఐపీవో అప్లికేషన్లను ఆమోదించేందుకు అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఎఎస్బీఏ) డిజిగ్నేటెడ్ బ్యాంక్ శాఖలన్నీ తెరిచి ఉంచాలని గురువారం ఆర్బీఐ ఆదేశించింది.
ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనే ఖాతాదారులకు గుడ్ న్యూస్ అంటూ ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఎల్ఐసీ ఐపీవో కోసం బిడ్ డాఖలు చేసే వారి సౌకర్యార్థం ఆదివారం (మే 8) మా అన్ని శాఖలు తెరిచి ఉంటాయి అని పేర్కొంది. ఈనెల నాలుగో తేదీన ప్రారంభమైన ఎల్ఐసీ ఐపీవోకు అన్ని వర్గాలనుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. గురువారం పూర్తిస్థాయిలో సబ్స్క్రైబ్ అయ్యింది.
ఎల్ఐసీ ఐపీవోలో 1.29 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. 20.85 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎల్ఐసీ ఐపీవోలో 16.2 కోట్ల ఈక్విటీ షేర్లకు మాత్రమే బిడ్లను ఆహ్వానించింది. పాలసీదారులు మినహా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి 3.77 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్లు 1.15 రెట్లు, ఉద్యోగులు 2.89 రెట్లు సబ్స్క్రైబ్ చేశారు.