న్యూఢిల్లీ, అక్టోబర్ 18: లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్.. ధరలు పెంచేయోచనలో ఉన్నది. ఉత్పత్తి వ్యయం అధికమవడంతోపాటు రూపాయి విలువ పడిపోవడంతో వచ్చే నెల నుంచి వాహన ధరలను పెంచాలనుకుంటున్నట్టు లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ తెలిపారు.
ప్రస్తుతం సంస్థ రూ.62 లక్షల నుంచి రూ.3 కోట్ల లోపు ఆరు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. ధరలను ఎంతమేర పెంచేదానిపై ఈ నెల చివర్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు.