హైదరాబాద్, ఏప్రిల్ 1: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ రూ.3,086 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్నది. మార్చి నెలకుగాను వచ్చిన ఆర్డర్లలో రూ.1,589 కోట్ల ఆర్డర్లు ఎలక్ట్రికల్ డివిజన్ నుంచి రాగా, మరో రూ.1,330 కోట్ల విలువైన ఆర్డర్లు రవాణా డివిజన్, రూ.167 కోట్ల ఆర్డర్ బిల్డింగ్ డివిజన్ నుంచి వచ్చాయని పేర్కొంది.
మరోవైపు, 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి సంస్థ రూ.26 వేల కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్నది.