న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఆదాయపు పన్ను రిటర్న్ల (ఐటీఆర్లు) దాఖలు గడువు పెంచుతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. గత కొన్ని రోజులుగా గడువు తేదీని పెంచుతారని వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. గడువు తేదీని మరోసారి పొడగించబోమని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టంచేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీఆర్ దాఖలుకు డిసెంబర్ 31ని గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గతేడాదితో పోలిస్తే 14 శాతం అధికంగా రిటర్న్లు దాఖలయ్యాయి. ఈ స్థాయిలో రిటర్న్లు వస్తుంటే గడువు తేదీని పొడిగించాల్సిన అవసరం ఏదీ లేదని బజాజ్ చెప్పారు.