ముంబై, సెప్టెంబర్ 20: క్రిప్టో కరెన్సీల విలువెంటో తనకు తెలియదని సీనియర్ బ్యాంకర్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్ఫిడ్) చైర్మన్ కేవీ కామత్ అన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పైవిధంగా స్పందించారు. అయితే మోదీ సర్కారు అధికారికంగా ఓ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో కామత్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. క్రిప్టోలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో ‘క్రిప్టోలపై ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయంతో నేనూ ఏఖీభవిస్తున్నాను. ఓ బ్యాంకర్గా క్రిప్టో విలువ నాకు కనిపించడం లేదు. ముఖ్యంగా క్రిప్టో, బ్లాక్చైన్లను ఒకటిగా చూస్తున్నారు. ఈ రెండూ ఒక్కటి కావు. బ్లాక్చైన్ను క్రిప్టోగా పరిగణించవద్దు’ అన్నారు.