పుణె, మార్చి 11: ప్రీమియం మోటర్సైకిళ్ల బ్రాండ్ కేటీఎం..నూతన సంవత్సరానికిగాను నయా రంగుల్లో పలు బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో 2024 కేటీఎం 390 అడ్వెంచర్..వైట్, బ్లాక్, కేటీఎం 250 అడ్వెంచర్ను గ్రే, బ్లూ, కేటీఎం ఆర్సీ 125, ఆర్200లను బ్లూ, బ్లాక్, అలాగే కేటీఎం ఆర్సీ 390ని బ్లూ, ఆరెంజ్ కలర్స్లో ప్రవేశపెట్టింది. కానీ, నూతన రంగుల్లో విడుదలైన మాడళ్ల ధరలను యథాతథంగా ఉంచింది సంస్థ. 500 సీసీ సెగ్మెంట్లో అగ్రగామిగా దూసుకుపోతున్న సంస్థ..ఈ ఏడాదిపై ప్రత్యేక దృష్టి సారించింది.