న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఓఈఎంఎస్లకు విడిభాగాలను అందిస్తున్న క్రాస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.500 కోట్ల నిధుల సేకరణలకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతినిచ్చింది. తాజా షేర్లను విక్రయించడంతో రూ.250 కోట్ల నిధులను సేకరించనుండగా, అలాగే ప్రమోటర్లకు చెందిన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనుండటంతో మరో రూ.250 కోట్ల నిధులు సమకూరనున్నాయని భావిస్తున్నది సంస్థ. వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, యంత్రాలను కొనుగోలు చేయడానికి, రుణాలను తగ్గించుకోవడానికి ఈ నిధులను వినియోగించనున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.489 కోట్ల ఆదాయంపై రూ.31 కోట్ల లాభాన్ని గడించింది.