న్యూఢిల్లీ, అక్టోబర్ 22: కొటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం ఈ సెప్టెంబర్ 30తో ముగిసిన 3 నెలల కాలంలో దాదాపు 27 శాతం పుంజుకొని రూ.2,581 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.2,032 కోట్ల నికర లాభాన్ని పొందినట్టు శనివారం బ్యాంక్ తెలియజేసింది. ఆదాయం ఈసారి రూ.10,047 కోట్లుగా ఉంటే, నిరుడు జూలై-సెప్టెంబర్లో రూ.8,408 కోట్లుగా ఉన్నది. వడ్డీ ఆదాయం 27 శాతం పెరిగి రూ.4,021 కోట్ల నుంచి రూ.5,099 కోట్లకు చేరింది.