హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నదని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త కోమలాదేవి అన్నారు. బుధవారం మేడ్చల్లో మహిళా సాధికారతపై జరిగిన సెమినార్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అరవై ఏండ్ల వయసులో తాను వ్యాపారవేత్తగా రాణిస్తున్నానని, మహిళలు సాధించలేనిది అంటూ ఏదీ లేదని ఆసక్తి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు. ‘వీ హబ్’ మహిళా సాధికారత దిశగా కృషిచేస్తూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తున్నదన్నారు.