న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా మరో రికార్డును సొంతం చేసుకున్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్యూవీ మాడల్ సెల్టోస్కు లక్షకు పైగా బుకింగ్లు వచ్చాయని సంస్థ ప్రకటించింది. ఎస్యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మాడల్ కూడా ఇదే కావడం విశేషం.
గతేడాది జూలై నెలలో అందుబాటులోకి వచ్చిన ఈ మాడల్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, ప్రతినెలా 13,500కి పైగా బుకింగ్లు వచ్చాయని పేర్కొంది. ఆగస్టు 2019లో తొలిసారి విడుదల చేసిన ఈ మాడల్ను దేశీయంగా 6 లక్షలకు పైగా యూనిట్లను ఉత్పత్తి చేసింది. వీటిలో 75 శాతం ఇక్కడే విక్రయించింది.