Kia EV6 Bookings | దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ఇండియా ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగు పెట్టింది. కియా తన తొలి ఎలక్ట్రిక్ కారు `ఈవీ6` బుకింగ్స్ మొదలైనట్లు ప్రకటించింది. ఈవీ కోసం అంకితం చేసిన ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫామ్ (ఈ-జీఎంపీ)పై ఈ ఈవీ6 తయారు చేస్తారు. ఈ కారు ఈ ఏడాది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ) భారత్లో 100 యూనిట్లు విక్రయిస్తామని కియా మోటార్స్ ఇండియా పేర్కొంది. వచ్చే వారం మార్కెట్లో ఆవిష్కరిస్తామని తెలిపింది.
కియా `ఈవీ6` కొనుగోలు చేయాలని భావించే వారు దేశంలోని 12 నగరాల్లో ఎంపిక చేసిన 15 డీలర్షిప్ల వద్ద రూ.3 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్లు కియా ఇండియా వెబ్సైట్ను సందర్శించి కూడా బుక్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జి చేస్తే 528 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం దీని స్పెషాలిటీ. కేవలం 5.2 సెకన్లలో 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లడం కియా `ఈవీ6` ప్రత్యేకత.
350కేడబ్ల్యూహెచ్ చార్జర్ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 10-80 శాతం వరకు బ్యాటరీ చార్జి చేయొచ్చు. ఆల్ వీల్ డ్రైవ్ (డబ్ల్యూడీ) సిస్టమ్ (ఇన్ సెలెక్ట్ ట్రిమ్స్), పనోరమిక్ సన్రూఫ్, మల్టీపుల్ డ్రైవ్ మోడ్స్, ఫార్వర్డ్ కొల్లిషన్ యావాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ తదితర 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నది.
కియా మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో తాయ్-జిన్పార్క్ స్పందిస్తూ.. భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరివర్తన చెందుతున్నది. అందులో కియా ముందు వరుసలో నిలుస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. అందులో భాగంగానే దేశీయ మార్కెట్లోకి `ఈవీ6`ఆవిష్కరిస్తున్నాం అని తెలిపారు.