హైదరాబాద్, జూన్ 26: అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా కటారు రవికుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. యాక్సిస్ ఎనర్జీ గ్రూపు సీఎండీగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ రెడ్డి 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను అసోచామ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్రాజెక్టులలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న రెడ్డి..రవాణా, మైనింగ్ రంగాల్లో కూడా సేవలు అందిస్తున్నారు. దక్షిణాదిలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయనున్నారు.