ముంబై, ఫిబ్రవరి 6: టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధ్యక్షతన ఏర్పాటైన మహారాష్ట్ర ఆర్థిక సలహాదారుల కౌన్సిల్లో గౌతమ్ అదానీ తనయుడు కరన్ అదానీ, ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీలు సభ్యులుగా నియమితులయ్యారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ కౌన్సిల్..రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికం, ఇతర రంగాలకు సంబంధించిన సమస్యల ఎలా పరిష్కరించాలో సూచించనున్నది. టెక్స్టైల్స్, ఫార్మా, రేవులు, బ్యాంకింగ్, వ్యవసాయం, తయారీ రంగానికి చెందిన నిపుణులు ఈ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్నారు.