ముంబై, నవంబర్ 15: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లర్స్.. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండో త్రైమాసికమైన జూలై- సెప్టెంబర్లో రూ.134.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. నిరుడు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.105. 92 కోట్లతో పోలిస్తే 27.33 శాతం పెరిగింది. కాగా, సమీక్ష కాలంలో కంపెనీ ఆదా యం ఏడాది ప్రాతిపదికన 27.11 శాతం ఎగబాకి రూ.3,472.91 కోట్ల నుంచి రూ.4,414.53 కోట్లకు చేరుకున్నట్టు కంపెనీ ఈ సందర్భంగా తెలియ జేసింది. అమ్మకాలు ఆశిం చిన స్థాయిలో ఉండడం కలిసొచ్చిందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.