Reliance- Just Dial Deal | జస్ట్ డయల్లో రిలయన్స్ పెట్టుబడులకు జస్ట్ డయల్ వార్షిక వాటాదారుల సమావేశం ఆమోదం తెలిపింది. జస్ట్ డయల్ టేకోవర్ కోసం అందులోని 66.95 శాతం వాటాల కోసం రూ.3,497 కోట్ల పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన అసాధారణ వార్షిక వాటాదారుల సమావేశం ఆమోదం తెలిపిందని రెగ్యులేటరీ ఫైలింగ్లో జస్ట్ డయల్ శనివారం పేర్కొంది.
ఇందులో రూ.2,165 కోట్ల విలువైన షేర్లను ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా కేటాయించడానికి కూడా ఆమోదం లభించిందని జస్ట్ డయల్ వెల్లడించింది. 97.49 శాతం మంది వాటాదారులు రిలయన్స్ పెట్టుబడులకు అనుమతినిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు.
గత నెలలో రిలయన్స్ రిటైల్, జస్ట్ డయల్ మధ్య ఒప్పందం కుదిరింది. రిటైల్, ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్లాలని తలపోస్తున్న రిలయన్స్.. జస్ట్ డయల్ వద్ద ఉన్న లక్షల మంది మర్చంట్ల, ఇతర యూజర్ల డేటా బేస్ పొందాలన్న సంకల్పంతో ఉంది.
రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రిలయన్స్ రిటైల్కు 21.2 మిలియన్ల ప్రిఫరెన్షియల్ షేర్లను రూ.1,022.25లకు జస్ట్ డయల్ కేటాయించనున్నది. రిలయన్స్ రిటైల్ 13.1 మిలియన్ల ఈక్విటీ షేర్లను జస్ట్ డయల్ ఫౌండర్ మనీ నుంచి రూ.1020లకు కొనుగోలు చేస్తుంది. దీంతో జస్ట్ డయల్లో రిలయన్స్ రిటైల్ వాటా రూ.40.95 శాతానికి చేరుతుంది. ఓపెన్ ఆఫర్ ద్వారా రిలయన్స్ రిటైల్ 26 శాతం టేకోవర్ చేస్తుంది.
దీంతో జస్ట్ డయల్ ప్రమోటర్గా రిలయన్స్ రిటైల్ వ్యవహరిస్తుంది. జస్ట్ డయల్ ఫౌండర్ వీఎస్ఎస్ మణి బిజినెస్ టు బిజినెస్ లావాదేవీలకు సారధ్యం వహిస్తారు.