Jio Network | దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో రిలయన్ జియో నెట్వర్క్ తాత్కాలికంగా పని చేయడం లేదు. పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. ముంబై టెలికం సర్కిల్ పరిధిలో జియో నెట్వర్క్ పని చేయడం లేదు. పలువురు జియో యూజర్లు ఇంటర్నెట్ యాక్సెస్ కావడం లేదని, రిసీవింగ్ కాల్స్… ఔట్ గోయింగ్ కాల్స్ వెళ్లడం లేదని శనివారం సోషల్ మీడియా వేదికలపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇతర సర్వీసుల యూజర్లు కూడా జియో నంబర్తో కనెక్ట్ కావడం లేదంటున్నారు.
ఫలితంగా దాదాపు రెండు గంటల పాటు జియో పని చేయడం లేదంటూ ట్విట్టర్లో జియో హ్యాష్ట్యాగ్ ట్రెండవుతున్నది. శనివారం సాయంత్రం కొందరు యూజర్లకు జియో నుంచి వార్నింగ్ మెసేజ్లు వచ్చాయి. తాత్కాలికంగా సేవలకు అంతరాయం కలుగుతుందని యూజర్లు అంటున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి జియో నెట్వర్క్ పని చేయడం లేదు. రాత్రి కల్లా నెట్వర్క్ను కంపెనీ యాజమాన్యం అందుబాటులోకి తెస్తుందని యూజర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
#జియో ఇట్స్ షో.. రెండు గంటలకు పైగా నో సర్వీస్ అని ఓ ట్విట్టర్ యూజర్ పేర్కొన్నాడు. మరో యూజర్ @జియోకేర్ ట్యాగ్ చేస్తూ దయచేసి సమస్య పరిష్కరించండంటూ మరో ట్విట్టరీ కామెంట్ చేశాడు. జియో నెట్వర్క్ సమస్యపై యాజమాన్యం రియాక్టయింది. అడపాదడపా జియో ద్వారా ఇంటర్నెట్ సర్వీసులు పొందడంలో గానీ, కాల్స్ చేయడంలో గానీ, రిసీవ్ చేసుకోవడంలో గానీ మీరు సమస్య ఎదుర్కొంటుండవచ్చు. అని జియో తెలిపింది. సాధ్యమైంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని పేర్కొంది.
ముంబైలో శనివారం 81 శాతం యూజర్లకు నో సిగ్నల్ అని వస్తున్నది. 11 శాతం మంది ఇంటర్నెట్, 8 శాతం మంది మొబైల్ ఫోన్ పని చేయడం లేదని సమాధానం వస్తున్నది. శనివారం మధ్యాహ్నం 11.46 గంటల నుంచి సమస్య తలెత్తినట్లు తెలుస్తున్నది. కొందరు యూజర్లు ఆల్టర్నేటివ్ మొబైల్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు తీసుకుంటామని అంటున్నారు.