ముంబై : న్యూ జీప్ మెరిడియన్ ప్రొడక్షన్ రంజన్గావ్ ప్లాంట్లో జోరుగా సాగుతుండగా డెలివరీలను అతిత్వరలో ప్రారంభించేందుకు జీప్ సన్నాహాలు చేపట్టింది. న్యూ జీప్ మెరిడియన్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమవగా డెలివరీలను లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది.
ఇక మే 19న న్యూ జీప్ మెరిడియన్ ధరలను జీప్ ప్రకటించనుంది. జీప్ మెరిడియన్ కూడా కంపాస్ ప్లాట్ఫాంపైనే రానుండగా లాంగర్ వీల్బేస్తో పాటు స్టైలిష్ లుక్తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. కంపాస్, లార్జర్ గ్రాండ్ చరోకీలను గుర్తుతెచ్చే విధంగా న్యూ జీప్ మెరిడియన్ డిజైన్ ఉంటుంది. సెవెన్ సీటర్గా మెరిడియన్ కస్టమర్ల ముందుకు రానుంది.
జీప్ మెరిడియన్ ప్రొడక్షన్ ప్రారంభమైన సందర్భంగా స్టెలాంటిస్ ఇండియా సీఈఓ, ఎండీ రోలండ్ బుచరా మాట్లాడుతూ 2021 తర్వాత భారత్లో తయారవుతున్న మూడవ న్యూ మోడల్ జీప్ మెరిడియన్ అని పేర్కొన్నారు. భారత రోడ్లకు అనుగుణంగా దేశీ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని జీప్ మెరిడియన్ డిజైన్ చేశామని చెప్పారు.