న్యూఢిల్లీ : భారత్లో ఈ ఏడాది జూన్లో జీప్ మెరిడియన్ను లాంఛ్ చేయనున్నట్టు జీప్ వెల్లడించింది. జీప్ మెరిడియన్ బుకింగ్స్ మేలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. మెరిడియన్ లాంఛ్ అయితే టయోటా ఫార్చూనర్, ఎంజీ గ్లోస్టర్ సహా ఇతర ఫుల్సైజ్ ఎస్యూవీలకు దీటైన పోటీ ఇస్తుందని జీప్ భావిస్తోంది.
ఐకానిక్ సెవెన్-స్లాటెడ్ జీప్ గ్రిల్, స్ట్రీప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో కూడిన రెక్టాంగ్యులర్ హెడ్ల్యాంప్స్తో మెరిడియన్ లుక్ పరంగా కంపాస్ను పోలి ఉంటుంది. గ్రిల్, టూ క్రోమ్ స్ట్రిప్స్తో ఫ్రంట్ బంపర్ విభిన్నంగా కనిపిస్తుంది. కంపాస్తో పోలిస్తే మెరిడియన్ 158ఎంఎం పొడవైన వీల్బేస్, పొడవు 42ఎంఎం అధికంగా ఉంటుంది. మెరిడియన్ 18 ఇంచ్ డైమండ్ డిజైన్ అలాయ్ వీల్స్తో పరుగులు పెడుతుంది.
ఏడు సీట్ల లేఅవుట్తో క్యాబిన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. డ్యాష్బోర్డ్ లేఅవుట్, 10.1 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ డిస్ప్లే వంటి ఫీచర్లు కంపాస్ను పోలిఉంటాయి. ఇక మెరిడియన్ ధర రూ 20 లక్షల నుంచి రూ 34 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. ఇక కారు 82 శాతం తయారీ స్ధానికంగా జరుగుతుందని, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతవుతుందని కంపెనీ పేర్కొంది.