న్యూఢిల్లీ : జీప్ నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ 2023 ప్రధమార్ధంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుందని జీప్ మాతృసంస్ధ స్టెలాంటిస్ ప్రకటించింది. 2023లో ఉత్పత్తి ప్రారంభం కానుండగా ఆపై ఆరు నెలల అనంతరం జీప్ నుంచి తొలి ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇమేజ్లను జీప్ విడుదల చేసింది.
ఈ కారు స్టెలాంటిస్ ఎస్టీఎల్ఏ ప్లాట్ఫాంపై రూపొందనుంది. జీప్ రెనెగేడ్ను తలపించేలా ఎలక్ట్రిక్ ఎస్యూవీ స్మార్ట్ లుక్తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో రెక్టాంగ్యులర్ హెడ్ల్యాంప్స్తో ఈ ఎస్యూవీ మెరవనుంది.
జీప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మాస్క్యులర్ లుక్తో రెనెగేడ్ తరహా డిజైన్తో కస్టమర్ల ముందుకు రానుంది. రియర్ సైడ్ త్రీడీ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్లు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. 2022లో జీప్ భారత్లో కంపాస్ ట్రయల్హాక్ను లాంఛ్ చేస్తుండగా న్యూ జనరేషన్ గ్రాండ్ చెరోకీ, త్రీ రో మెరిడియన్ ఎస్యూవీలతో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక జీప్ ఈవీ భారత్లో 2024లో ఎంటర్ కావచ్చని భావిస్తున్నారు.