Jack Ma Down @ Paytm | చైనా సంపన్నుడు జాక్మా సారధ్యంలోని ఆలీబాబా, దాని అనుబంధ యాంట్ఫిన్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పేటీఎం మాల్లోని మొత్తం తమ వాటాలను రూ.42 కోట్లకే విక్రయించేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. పేటీఎం మాల్ నుంచి నిష్క్రమణ లావాదేవీ విలువ సుమారు రూ.100 కోట్లు ఉండొచ్చునని అంచనా. పేటీఎం మాల్లో ఆలీబాబా వాటా 28.34 శాతం, యాంట్ ఫిన్ 14.98 శాతం వాటాను వదులుకున్నాయి.
పేటీఎం మాల్లో 28.34 శాతం ఆలీబాబా, యాంట్ఫిన్ (నెదర్లాండ్స్) వాటా 14.98 శాతం విక్రయించామని పేటీఎం మాల్ మాతృత్వ సంస్థ పేటీఎం ఈ-కామర్స్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. 2020లో నిధుల సేకరణ తర్వాత పేటీఎం మాల్కు భారీ దెబ్బ అని చెబుతున్నారు.
2017లో ఆలీబాబా 100 కోట్ల డాలర్ల నిధులు ఉన్నప్పుడు పేటీఎం మాల్ తొలిసారి 200 మిలియన్ డాలర్లు సేకరించింది. ఆలీబాబాతోపాటు యాంట్ ఫైనాన్సియల్, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి పేటీఎం మాల్ సుమారు 800 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది.