సీనియర్ సిటిజన్లు తమకు వస్తున్న పింఛను, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) వడ్డీ ఆదాయంపై డిక్లేరేషన్ ఇవ్వాలంటూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం పింఛను, వడ్డీ జమవుతున్న బ్యాంకు లో ఆదాయం పన్ను (ఐటీ) చట్టం 12బీబీఏ సెక్షన్ ప్రకారం వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. దీంతోపాటే సెక్షన్ 87ఏ ప్రకారం ఐటీ రిబేట్ వివరాలనూ సమర్పించాలి. డిక్లరేషన్ను సమర్పించిన తర్వాత వివరాలను బ్యాంకు అధికారులు పరిశీలించి పన్ను పరిధిలోకి ఆదాయం వస్తే పన్నును మినహాయించుకుంటారు. 75 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయం పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు నుంచి బడ్జెట్లో మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిక్లరేషన్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా సీనియర్ సిటిజన్లు ఇవ్వాల్సిందే. ఈ డిక్లరేషన్ ఫామ్ ఐటీఆర్ ఫామ్ మాదిరిగానే చాలా వివరంగా ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే 75 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు బ్యాంకే ఇక ఐటీ శాఖ.