ముంబై, మార్చి 30: ఐపీవోల సందడి అంతంత మాత్రంగానే ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థలు నికరంగా రూ.52,116 కోట్ల సమీకరించాయి. అంతక్రితం ఏడాది సేకరించిన రికార్డు స్థాయి రూ.1,11,547 కోట్లతో పోలిస్తే సగానికి సగం పడిపోయాయి. 2022-23లో సేకరించిన 50 వేల కోట్లలో 39 శాతం రూ.20,557 కోట్ల ఎల్ఐసీలో వాటా విక్రయించడం ద్వారా సమకూరినవి కావడం విశేషం. మిగతా సంస్థలు కలిసి రూ.31,559 కోట్లు సేకరించాయి.