Apple | న్యూఢిల్లీ, జూన్ 30: ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ మరోసారి 3 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరింది. శుక్రవారం అమెరికాలోని నాస్డాక్లో యాపిల్ షేరు 193 డాలర్లకు చేరడంతో దీని విలువ 3.3 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ.250 లక్షల కోట్లు) చేరుకుంది. నిరుడు జనవరి 3న ఇంట్రాడే ట్రేడింగ్లో 3 ట్రిలియన్ మార్క్ను చేరినా, ఆ స్థాయిని దాటలేకపోయింది.
తాజాగా ఇది ఆ స్థాయిపైన ముగిస్తే ప్రపంచ మార్కెట్లో ఈ ఫీట్ సాధించిన ఏకైక కంపెనీగా యాపిల్ ఘనత పొందుతుంది. యాపిల్ విలువ ఎన్నో దేశాల జీడీపీకంటే ఎక్కువ. మొత్తం భారత స్టాక్ మార్కెట్ విలువలో (రూ.296 లక్షల కోట్లు) 80 శాతం వరకూ ఉంది. ఇండియాలో అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17 లక్షల కోట్లు.