న్యూఢిల్లీ, జూన్ 21: దేశంలో టెక్నాలజీ రంగ పెట్టుబడుల పట్ల సెంటిమెంట్ బలహీనపడటం, స్టార్టప్లకు నిధులు సమీకరించే శక్తి సన్నగిల్లడంతో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్స్ పెట్టుబడులు భారీగా తగ్గుతున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ ఎర్నస్ట్ అండ్ యంగ్ (ఈవై) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో ఈ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ 44 శాతం క్షీణించి 3.5 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి.
2022 మే నెలలో పీఈ/వీసీల నుంచి 6.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, ఈ ఏడాది ఏప్రిల్లో 7.4 బిలియన్ డాలర్ల నిధులు తరలివచ్చాయి. గత ఏడాదిన్నర కాలంగా భారీగా నిధులు వచ్చాయని, అయితే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అందుకున్న సంస్థలు వృద్ధిని, మార్జిన్ల మెరుగుదలను కొనసాగించలేకపోయాయని వీవై పార్టనర్ వివేక్ సోని చెప్పారు. మే నెలలో హెల్త్కేర్, ఫైనాన్షియల్ రంగాలు మాత్రమే కొద్దిపాటి పెట్టుబడుల్ని ఆకర్షించగలిగాయని తెలిపారు.