రాత్రి 11.30 నుంచి ఆదివారం ఉదయం 4.30 వరకు
న్యూఢిల్లీ: ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు శనివారం రాత్రి అంతరాయం కలుగనున్నది. టెక్నాలజీ అప్గ్రేడ్ చేసేందుకు శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 4.30 గంటల వరకు తమ ఇంటర్నెట్ సర్వీసుల్ని నిలిపివేయనున్నట్లు ఎస్బీఐ ట్వీట్ చేసింది. ఈ సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనోలైట్, యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ ట్విటర్ ద్వారా తెలిపింది.