న్యూఢిల్లీ, జూలై 29: ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రైవేటీకరణ వేగవంతం కానున్నది. జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్ చట్టాని (గిబ్న)కి సవరణలను కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించిన నేపథ్యంలో ఈ బిల్లు ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్కు రావచ్చని సంబంధిత వర్గాలు అంటున్నాయి. 1972లో గిబ్న అమల్లోకి వచ్చింది. భారతీయ బీమా సంస్థల వాటాల బదిలీ, కొనుగోళ్లకు ఇది అవకాశం కల్పిస్తుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో రెండు ప్రభుత్వ రంగ బీమా సంస్థల ప్రైవేటీకరణను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇందుకు వీలుగానే ఈ చట్టానికి సవరణలు చేయగా, వాటికిప్పుడు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంట్లో ఆమోదం పొందితే, ప్రభుత్వ బీమా సంస్థల్లో వాటాల విక్రయానికి లైన్క్లియర్ కానున్నది. ముఖ్యంగా ఎల్ఐసీ మెగా ఐపీవోకు మార్గం సుగమం అవుతుంది.