ముంబై, డిసెంబర్ 28: దేశీయ మార్కెట్లోకి నూతన హైబ్రిడ్ వెర్షన్ మల్టీ-పర్పస్ మోడల్ ఇన్నోవా హైక్రాస్ను పరిచయం చేసింది టయోటా కిర్లోస్కర్. ఈ కారు ప్రారంభ ధర రూ.18.30 లక్షలు(ముంబై షోరూంలో). గత నెలలో విడుదల చేసినప్పటికీ వచ్చే నెల నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ వెర్షన్ మోడల్ రూ.24.01 లక్షల నుంచి రూ.28.97 లక్షల మధ్యలో లభించనుండగా..అలాగే గ్యాసోలైన్ వెర్షన్ రూ.18.30-19.20 లక్షల మధ్యలో లభించనున్నాయి.