Infosys Naranayan Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘అన్కామన్ లవ్: ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’ పుస్తకం గతేడాది డిసెంబర్లో విడుదలైంది. నారాయణమూర్తి, సుధామూర్తి కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులు, అవమానాలను ఇండో అమెరికన్ రచయిత్రి చిత్రా బెనర్జీ దివకరుణి అందులో ప్రస్తావించారు. ఇన్ఫోసిస్కు తొలినాళ్లలో అమెరికాకు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ క్లయింట్గా ఉండేది. ఈ కంపెనీని డానీ లీల్స్ అనే వ్యాపారవేత్త నిర్వహించేవాడు.
అతను నారాయణమూర్తి బృందానికి సరైన సమయంలో చెల్లింపులు చేయకుండా ఇబ్బందులకు గురి చేసేవాడని, మాన్హాట్టన్లోని డేటాబేసిక్స్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో సరైన వసతులు కల్పించేవాడు కాదని పుస్తకం చిత్రా బెనర్జీ వెల్లడించారు. ఓసారి డేటా బేసిక్స్కు సర్వీస్ అందించేందుకు నారాయణమూర్తి ఓ సారి అమెరికాకు రాగా.. ఆ సమయంలో డానీ లీల్స్ కిటికీలు కూడా లేని స్టోర్రూమ్ను ఆయనకు ఇచ్చారు. ఆయన ఇంట్లో నాలుగు బెడ్రూంలు ఉన్నా.. ఆయనను ఇరుకుగదిలో పెద్ద బల్లపై పడుకునేలా చేశాడని.. అయినా ఎన్నో సందర్భాల్లో చివరి నిమిషంలో డానీ డిమాండ్లన్నింటినీ నారాయణమూర్తి నెరవేర్చారని ఆ పుస్తకంలో తెలిపారు.
ఇన్ఫోసిస్ ప్రారంభ దశలో ఉండడంతో కంపెనీ కోసం షార్ట్టెంపర్ వ్యాపారవేత్తను ఆయన భరించారని.. చెక్కబల్లపై పడుకున్న ఘటన మాత్రం ఆయనను కలవరానికి గురి చేసిందన్నారు. ‘అతిథి అంటే దేవుడిలాండవాడని మా అమ్మ చెబుతుండేదని.. అతిథులతో మీరు వ్యవహరించే తీరు చూస్తుంటే మీరు ఎలాంటి వారో తెలుసుకుంటారు’ అని ఓ సందర్భంలో నారాయణమూర్తి తన భార్య సుధామూర్తితో తెలిపారు. తన తండ్రి ముందస్తు సమాచారం లేకుండా ఎన్నోసార్లు ఇంటికి అతిథులను ఆహ్వానించినా.. తన చేతులతో వండిన భోజనం వడ్డించేది. ఆమె తినకుండా నిద్రపోయేది.
కానీ, డానీ తనకు పడుకోవడానికి స్టోర్రూమ్ ఇచ్చాడు’ అని చెప్పినట్లుగా పుస్తకంలో పేర్కొన్నారు. అయితే సుధామూర్తి మంచి ఇంజినీర్ అయినప్పటికీ తన భార్య ఇన్ఫోసిస్లో చేరడాన్ని ఎందుకు వ్యతిరేకించారో సైతం పుస్తకంలో వివరించారు. ‘ఒకరోజు సాయంత్రం తామంతా భోజనం చేస్తున్న సమయంలో సుధ కంపెనీలో పని చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఆమె స్పష్టంగా తాను పని చేయలేనని చెప్పింది. ఇద్దరం ఒకే కంపెనీలో పని చేయలేమని నమ్మాను. కుటుంబ యాజమాన్యంలో వ్యాపారాలు రాజవంశం లేదంటే బంధుప్రీతిగా వేదిక ఉండకూడదని నేను కోరుకోలేదు.
‘సుధకు చాలా సత్తా ఉందని, అలాంటి దృఢనిశ్చయం ఎవరికీ లేదు. ఆమె చేరితే ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ కంపెనీగా కాకుండా భార్యాభర్తల కంపెనీగా మారుతుంది’ అని నారాయణమూర్తి భావించినట్లు బుక్లో చిత్ర వెల్లడించారు. కన్నడ నేపథ్యం, పఠనాభిమానం కారణంగా సుధ, నారాయణమూర్తి మధ్య చాలా విషయాల్లో ఉమ్మడి అభిప్రాయాలు ఉన్నాయని దివకరుణి పుస్తకంలో వివరించారు. అయితే, ఇద్దరి బాల్యం చాలా భిన్నంగా ఉండేదని.. నారాయణమూర్తి సోషలిస్ట్, యుక్తవయసులో తన తండ్రి ఆలోచనలు ఉండేవని పుస్తకంలో వివరించారు.