న్యూఢిల్లీ, జనవరి 18: ప్రైవేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,301 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,964 కోట్ల కంటే 17 శాతం అధికం. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.11,534 కోట్ల నుంచి రూ.13,968 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.06 శాతం నుంచి 1.92 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.62 శాతం నుంచి 0.57 శాతానికి దిగొచ్చాయి.