హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్- ఢాకాల మధ్య డిసెంబర్ 8 నుంచి ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు నగరాల్ని నేరుగా కనెక్ట్ చేస్తూ మూడు వీక్లీ ఫ్లైయిట్స్ నడుపుతామని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బంగ్లాదేశ్ టూరిస్టులను ఆకర్షించే ఎన్నో ప్రదేశాలు హైదరాబాద్లో ఉన్నాయని, ఉన్నతమైన వైద్య సేవలు లభిస్తున్నాయని, అలాగే పారిశ్రామిక హబ్గా అవతరిస్తున్న బంగ్లాదేశ్లో వ్యాపారాల్ని విస్తరించడానికి అవకాశాలున్నాయని మల్హోత్రా వివరించారు.