న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఆహార పదార్థాల ధరలు శాంతించడంతో గత నెలకుగాను రిటైల్ టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6.83 శాతానికి దిగొచ్చింది. జూలై నెలలో 7.44 శాతంగా నమోదైన ధరల సూచీ ఏడాది క్రితం ఇదే నెలలో 7 శాతంగా ఉన్నట్టు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది. ఆహార ద్రవ్యోల్బణం దిగిరావడం ఇందుకు కారణమని విశ్లేషించింది.
ఈ ఏడాది ల్లో 11.51 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం..ఆగస్టు నెలకుగాను 9.94 శాతానికి దిగొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ టోకు ధరల సూచీని 5.4 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.