Tata Motors | వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు జోరందుకుంటాయని టాటా మోటార్స్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్యూవీ కార్లపై మోజు పెరుగుతున్నా వచ్చే ఏడాది వాటి విక్రయాల గ్రోత్ ఐదు శాతం లోపేనని చెప్పారు. అయితే, ఈవీ చార్జింగ్ ఇన్ ఫ్రా వసతులు తక్కువగా ఉన్నా ఈవీ కార్ల విక్రయాలు పెరుగుతాయన్నారు.
గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో కార్ల విక్రయాల్లో 25 శాతం గ్రోత్ రికార్డైనా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు శాతానికి మాత్రమే పరిమితమైందన్నారు శైలేష్ చంద్ర. కానీ, ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల కల్పనలో గ్రోత్ నమోదు కాకున్నా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ పుంజుకుంటున్నాయని, ఇది ఈవీ రంగానికి పెద్ద సవాల్ గా మారుతుందన్నారు.
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ మౌలిక వసతుల విస్తరణ కోసం ఇతర సంస్థల భాగస్వామ్యంతో పని చేసేందుకు టాటా మోటార్స్ సిద్ధంగా ఉందని శైలేష్ చంద్ర చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలతోపాటు చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లతోనూ చర్చిస్తున్నట్లు తెలిపారు.