న్యూఢిల్లీ : డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ క్రమేణా పుంజుకుంటున్నది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్పడటం కలిసొచ్చింది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 52 పైసలు ఎగబాకి 92.54కి చేరుకున్నది.
92.92 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు ఒక దశలో 92.45కి ఎగబాకింది. మంగళవారం ముగింపుతో పోలిస్తే 52 పైసలు అందుకొని 92.54 వద్ద స్థిరపడింది.