2025 నాటికి చేరుకోనుందంటున్న వాల్మార్ట్ సీఈవో
న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశీయ రిటైల్ రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. వచ్చే నాలుగేండ్లలో దేశీయ రిటైల్ రంగం లక్ష కోట్ల డాలర్లకు చేరుకోనున్నదని వాల్మార్ట్ ప్రెసిడెంట్, సీఈవో డౌగ్ మెక్మిలన్ తెలిపారు.
‘కన్వరేజ్@వాల్మార్ట్ పేరుతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..భారత మార్కెట్ చాలా విభిన్న మార్కెట్..అక్కడ స్థానిక నిర్ణయాలకు అనుగుణంగా ఆలోచించాల్సి ఉంటుంది..అక్కడి ఉన్న నియమ నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. మరోవైపు, వాల్మార్ట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించబోమని స్పష్టంచేశారు.