న్యూఢిల్లీ, మే 15: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 6.6 శాతంగా నమోదుకానున్నదని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనావేస్తున్నది. దేశ ఆర్థిక రంగం పరుగులు పెడుతున్నదని, ముఖ్యంగా రుణ వితరణ బలంగా ఉండటం, బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలు అంచనాలకుమించి రాణించడం కూడా జీడీపీ వృద్ధికి దోహదం చేస్తున్నదని అభిప్రాయపడింది.