న్యూఢిల్లీ, డిసెంబర్ 19: విదేశాల్లో ఉన్న భారతీయులు దేశానికి పంపుతున్న నగదు రికార్డు స్థాయిలో పెరుగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 125 బిలియన్ డాలర్ల విలువైన నగదు పంపారని వరల్డ్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. యూఏఈతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ధిర్హామ్స్, రూపాయిల్లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు జరగడం వల్లనే రెమిటెన్స్లు భారీగా పెరిగాయని తెలిపింది.
2022లో 24.4 శాతం పెరిగి రెమిటెన్స్లు, ఈ ఏడాది మాత్రం 12.4 శాతం వృద్ధిని నమోదు చేసుకోనున్నాయని తెలిపింది. 2023లో భారత్లోకి రెమిటెన్స్లు ఏడాది ప్రాతిపదికన 14 బిలియన్ డాలర్లు పెరిగి 125 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నాయని రెమిటెన్స్లు ఆకట్టుకోవడంలో భారత్ తర్వాత మెక్సికో (67 బిలియన్ డాలర్లు), చైనా (50 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (40 బిలియన్ డాలర్లు), ఈజిప్ట్(24 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.