నల్లగొండ, ఏప్రిల్ 8: యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఈసారి 7.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 191, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 157, మార్కెటింగ్ శాఖ ద్వారా 17 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ట్యాంగింగ్ చేసిన మిల్లులకు కోటా ప్రకారం ధాన్యం తరలించాలని ఆదేశించారు. కరోనా దృష్టిలో పెట్టుకొని భౌతిక దూరం పాటించాలన్నారు. గన్నీ బ్యాగులు వెంటనే సరఫరా చేస్తామన్నారు. సమావేశంలో డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, పౌరసరఫరాల డీఎం నాగేశ్వర్రావు, డీసీఓ ప్రసాద్, డీఏఓ శ్రీధర్రెడ్డి, డీపీఆర్ఓ శ్రీనివాస్, ఏఎస్ఓ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
రైతుల మేలు కోసమే కొనుగోలు కేంద్రాలు
విస్తృతంగా కొవిడ్ వ్యాక్సినేషన్