ICICI ATM Charges | యాక్సిస్ బ్యాంక్ బాటలో ఐసీఐసీఐయాక్సిస్ బ్యాంక్ బాటలోనే ఐసీఐసీఐసీ బ్యాంక్ పయనించనున్నది. కొత్త ఏడాది అంటే 2022 జనవరి ఒకటో తేదీ నుంచి తన బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్పై సర్వీస్ ఛార్జీలను పెంచనున్నట్లు ప్రకటించింది. అంతే కాదు… ఏటీఎంలో నగదు లావాదేవీల్లోనూ మార్పులు తీసుకున్నది. దీని ప్రకారం ఖాతాదారులు ప్రతి నెలలో ఆ బ్యాంకు ఏటీఎంల్లో ఐదుసార్లు ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. ఒకవేళ ఆ పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేస్తుంది.
ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు నగదు విత్ డ్రాయల్స్కు పరిమితులు విధించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడు సార్లు, ఇతర నగరాల్లో ఐదు సార్లు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితి ఆర్థికేతర లావాదేవీలకూ వర్తిస్తుంది.ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి చేసే విత్డ్రాయల్స్పై చార్జీలు పెరుగనున్నాయి.
పెరిగిన సాధారణ ఖర్చులతోపాటు అధిక ఇంటర్ చేంజ్ ఫీజు భర్తీ చేసుకునేందుకు వీలుగా కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులకు ఆర్బీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కనుక వివిధ బ్యాంకుల ఏటీఎంల వద్ద నెలవారీ ఉచిత పరిమితిని మించి జరిపే లావాదేవీలపై చార్జీలు 2022 జనవరి నుంచి పెరుగనున్నాయి.