హైదరాబాద్: హైదరాబాద్లో ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోకి వచ్చే గచ్చిబౌలి ప్రాంతంలో ప్రవీణ్ అనే ఐటీ ఉద్యోగి ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ కొనుగోలు చేశాడు. రెండేండ్ల క్రితమే కొనుగోలు చేసిన ఆ ఇల్లు అమ్మేసి.. రెండు ఇండ్లు కొనాలని సంకల్పించాడు. వాటిల్లో ఒకటి తనతోపాటు తన కొడుకు, రెండోది తనతోపాటు కూతురు పేరిట కొనాలని ఆయన ఆలోచన. పెట్టుబడి మొత్తం ప్రవీణ్దే. ఈ రెండు ఇండ్లను కొనుగోలు చేసినందుకు ఐటీ మినహాయింపులు వస్తాయా? రావా? అన్నది ఆయన ధర్మ సందేహం.
ఆదాయం పన్ను చట్టంలోని 54 సెక్షన్ ప్రకారం పన్ను చెల్లింపు దారు కొనుగోలు చేసిన సొంతింటిని నిర్దిష్ఠ గడువులోపు విక్రయించేసి.. మరో రెసిడెన్షియల్ హౌస్ కొనుగోలు చేయొచ్చు. దీనికి దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాల కింద పన్ను మినహాయింపు లభిస్తుందని ఐటీ చట్టంలోని 54 సెక్షన్ చెబుతుంది. కేవలం ఇండెక్సెడ్ క్యాపిటల్ గెయిన్స్ పరిధిలోనే ఈ ఇంటి విక్రయంపై వచ్చే లాభాలకు మినహాయింపు సాధ్యం. కానీ ఇప్పటికే ఉంటున్న ఇంటి విక్రయ ప్రతిపాదనకు వర్తించదు.
ప్రవీణ్ వంటి వారు ముందుగా తలిచిన దానికంటే తక్కువ మాత్రమే పెట్టుబడి పెట్టాలి. కేవలం ఒక రెసిడెన్షియల్ హౌస్ లేదా ఒక రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీకి మాత్రమే దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాల నుంచి మినహాయింపు లభిస్తుంది.
అయితే, ఒక భవనంలో ఒక డ్యూప్లెక్స్, అనుసంధానించిన ప్లాట్లను సింగిల్ రెసిడెన్షియల్ యూనిట్గా చూపితే పన్ను మినహాయింపు పొందొచ్చునని పలు ఆదాయం పన్ను ట్రిబ్యునళ్లు తీర్పులిచ్చాయి. ప్రవీణ్ మాదిరిగా మీరు మీ పిల్లల పేరుతో ఇండ్లను కొనుగోలు చేయడానికి ఎటువంటి ఆంక్షలు లేవు. కానీ కొన్ని నిర్దిష్ఠ పరిస్థితుల్లో ఈ ఇండ్లపై పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు కల్పించాలి.
ఆస్తిని కొనుగోలు చేయడంలో పెట్టుబడి పెట్టకున్నా మీ కొడుకు లేదా కూతురిని అగ్రిమెంట్లో జాయింట్ ఓనర్గా చేయొచ్చు. మీ మరణం తర్వాత మీ పిల్లల మధ్య వాటాల పంపకం సజావుగా సాగేందుకు వీలుగా ఇది ఉపకరిస్తుంది. మీరు మరణించిన తర్వాత వారసత్వంగా వచ్చిన ఆస్తులపై మీ కొడుకు గానీ, కూతురు గానీ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్దిష్ఠ మొత్తంలో చేసే దీర్ఘ కాలిక పెట్టుబడి లాభాలపై మీరు కూడా పన్ను పే చేయక్కర్లేదు.