ప్రారంభించిన ఎయిర్ ఇండియా
హైదరాబాద్ (శంషాబాద్), సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి లండన్కు ప్రయాణించేవారికి శుభవార్తను అందించింది ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. భాగ్యనగరం నుంచి వారానికి రెండుసార్లు డైరెక్ట్ ఫ్లైట్ను నడుపుతున్నట్లు ప్రకటించింది. సోమ, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ విమాన సర్వీసును ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులు వినాయకచవితి(శుక్రవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎమ్మార్ ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ… హైదరాబాద్-లండన్కు ఎయిర్ఇండియా విమానాలను ప్రారంభించడం ద్వార విద్యార్థులకు, యూరప్ వెళ్లేవారికి, వ్యాపార, పారిశ్రామిక రంగాల వారికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.