హైదరాబాద్, నవంబర్ 19: ముంబైకి చెందిన ఇమ్యూనోయాక్ట్లో 26.62 శాతం వాటాను కొనుగోలు చేసింది ప్రముఖ ఔషధ సంస్థ లారస్ ల్యాబ్. సెల్, జెనో థెరపీ సేవలు అందిస్తున్న ఇమ్యూనోయాక్ట్లో ఈ వాటాను కొనుగోలు చేయడానికి రూ.46 కోట్ల నిధులు వెచ్చించింది. మరోవైపు, లారస్ ల్యాబ్కు చెందిన సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులు కూడా మరో 5.64 శాతం వాటాను రూ.9.75 కోట్లకు కొనుగోలు చేశారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన వాటా కొనుగోలు ఒప్పందంతో భారత్తోపాటు ఇతర దేశాల్లో సెల్, జన్యు చికిత్సకు సంబంధించిన మరిన్ని ఉత్పత్తులు విడుదల చేయడానికి దోహదం చేయనున్నది. ప్రస్తుతం ఇమ్యూనోయాక్ట్ ప్రమోటర్గా ఉన్న రాహుల్ పూర్వార్ భవిష్యత్తులో ఆయనే కొనసాగనున్నారు.