హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఎ) మరో 30 ఏండ్లపాటు జీఎమ్మార్ సొంతమైంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కాంట్రాక్టును పొడిగించింది. మార్చి 23, 2038 నుంచి 2068 వరకు పెంచినట్టు ఎక్సేంజీలకు జీఎమ్మార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమాచారం ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి ధ్రువీకరణ లేఖ కూడా అందినట్టు పేర్కొన్నది. జీఎమ్మార్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ (జీహెచ్ఐఎఎల్) 2004 నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్నది.